దక్షిణాది సినీ పరిశ్రమలో సంచలనం రేపిన “జన నాయకన్” సినిమా లీక్ ఘటనపై పలువురు స్టార్ హీరోలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదిక X (మునుపటి ట్విట్టర్) లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
వరుణ్ తేజ్ తన పోస్టులో.. “#Jananayagan పై జరుగుతున్నది అసహ్యం. విడుదల కాని కంటెంట్ను లీక్ చేయడం వినోదం కాదు – అది స్పష్టమైన దొంగతనం, మొత్తం టీమ్ కష్టాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయడమే. ఈ పని చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఇలాంటి పనులకు ఫలితాలు తప్పక ఉండాలి. ఈ పిరసీ చర్యకు మద్దతు ఇవ్వొద్దు” అని పేర్కొన్నారు.
ఈ ఘటనపై రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్ తమ ఆందోళన వ్యక్తం చేశారు. రజనీకాంత్ మాట్లాడుతూ, “జన నాయకన్ సినిమా ఇంటర్నెట్లో లీక్ కావడం షాక్, బాధ కలిగించింది. దీనిపై ఫిల్మ్ అసోసియేషన్స్ గళమెత్తాలి. బాధ్యులను గుర్తించి ప్రభుత్వం కఠిన శిక్షలు విధించాలి. ఇలాంటి నేరాలు భవిష్యత్తులో జరగకుండా చూడాలి” అని అన్నారు.
చిరంజీవి తన సందేశంలో, “#Jananayagan లీక్ చాలా ఆందోళన కలిగిస్తోంది. సినిమా అనేది నమ్మకం, కష్టం, అనేకమంది కలలపై ఆధారపడింది. ఇలాంటి ఘటనలు మొత్తం పరిశ్రమను ప్రభావితం చేస్తాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్కు మేమంతా మద్దతుగా ఉన్నాం. పిరసీని అరికట్టాలి – సినిమా కాపాడాలి” అని పేర్కొన్నారు.
Also Read:బాధితుల ఫోటోలతో పాక్కు ఇరాన్ ప్రతినిధులు
ఇక కమల్ హాసన్ స్పందిస్తూ, “ఈ లీక్ యాదృచ్ఛికం కాదు – వ్యవస్థలో లోపాల ఫలితం. సర్టిఫికేషన్లో ఆలస్యం వల్లే పిరసీకి అవకాశం లభించింది. లీగల్ యాక్సెస్ లేకపోతే అక్రమ మార్గాలు పెరుగుతాయి. పిరసీ అనేది కళాకారులపై దాడి” అని వ్యాఖ్యానించారు.

