హత్యలతో నోళ్లు మూయించలేరు:బీజేపీపై ఆ పార్టీ ఎంపీ ఫైర్

204
varun gandhi
- Advertisement -

యూపీలోని లఖీంపూర్ ఖేరీలో జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ సైతం తనదైన శైలీలో స్పందించారు. హ‌త్య‌ల‌తో నిర‌స‌న‌కారుల నోళ్లు మూయించ‌లేరని పేర్కొన్నారు.

ఘటనకు సంబంధించిన వీడియోని షేర్ చేసిన వరుణ్… అమాయ‌క రైతుల ర‌క్తం క‌ళ్ల చూసిన వారిని బాధ్యుల‌ను చేయాలి. ఈ క్రూర‌త్వం, అహంకారానికి సంబంధించిన సందేశం రైతుల మెద‌ళ్ల‌లోకి వెళ్ల‌క ముందే న్యాయం జ‌ర‌గాలి అని ట్వీట్ చేశారు.

- Advertisement -