తొలి టీ20లో భారత్ ఘనవిజయం సాధించిన సమయంలో వరుణ్ చక్రవర్తి తన పూర్తి 4 ఓవర్ల కోటాను పూర్తి చేసినప్పటికీ గాయం కారణంగా మిగిలిన రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. మ్యాచ్ పూర్తయిన తర్వాత ఆయనకు గాయమైంది. అయితే, గాయం తీవ్రత ఎంతనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది.
గత కొన్ని నెలలుగా వరుణ్ వరుస గాయాలతో బాధపడుతున్నాడు. ఐపీఎల్ 2026 సమయంలో కాలి గాయమైనప్పటికీ కేకేఆర్ (KKR) తరఫున ఆడాడు. ఆ తర్వాత బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో పునరావాసం పొంది, ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్కు దూరమయ్యాడు. ఇంగ్లాండ్తో సిరీస్కు రీఎంట్రీ ఇచ్చినప్పటికీ, మూడో మ్యాచ్ తర్వాత మళ్లీ గాయం కావడంతో తప్పుకోవాల్సి వచ్చింది.
తొలి మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో వరుణ్ తన గాయాలపై స్పందిస్తూ— “క్రీడాకారులకు గాయాలు కావడం చాలా సహజం. మనం పరిమితులకు మించి శ్రమిస్తున్నామని అనడానికి ఇదొక సంకేతం. శరీర సహకరించనప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గి, మరింత బలంగా పునరాగమనం చేయాల్సి ఉంటుంది” అని పేర్కొన్నాడు.
Also Read:వినాయక చవితి..స్పెషల్ వంటకాలు
మొదటి టీ20లో సులభ విజయం సాధించిన టీమిండియా, సెప్టెంబర్ 15న ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది.

