వందే భారత్ మిషన్లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న వారిని భారత్కు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చే ప్యాసింజర్లు తప్పనిసరిగా నాలుగు రోజుల ముందే కరోనా టెస్టుచేయించుకుని, సర్టిఫికెట్ తీసుకురావాలని స్పష్టం చేసింది.
ప్రెగ్నెంట్లు, చిన్న పిల్ల కు సర్టి ఫికెట్ లేకపోయినా క్వారంటైన్ ఉండదన్నా రు. బిజినెస్ పని మీద వచ్చేవారు కూడా సర్టిఫికెట్ తెచ్చుకోవాలని, అయితే, వారు తిరిగి నాలుగు రోజుల్లో వెళ్ళి పోయేందుకు రిటర్న్ టికెట్ టికెట్లు బుక్ చేసుకుని ఉంటే వారికి కూడా క్వారంటై న్ ఉండదని పేర్కొన్నారు.
విదేశాల నుంచి వచ్చేవారు అక్కడ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసుకోవాలని, ఆ సర్టిఫికెట్ ను ఇక్కడ తప్పని సరిగా చూపించాలని రూల్ పెట్టింది. టెస్టులో నెగెటివ్ వచ్చినట్లు సర్ఫిటి కెట్ ఉన్నవారు క్వా రంటైన్ లేకుండా నేరుగా ఇంటికి వెళ్ళి పోవచ్చని అధికారులు శుక్రవారం వెల్లడించారు.