రాహుల్ గాంధీకి షాక్.. ముందంజలో సృతి ఇరాని

284
rahul kerala
- Advertisement -

దేశ వ్యాప్తంగా ఉదయం 8గంటలకు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట అర్ధగంట సేపు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఈవిఎంల కౌంటింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఆయన పోటీ చేసిన అమేధిలో బీజేపీ అభ్యర్ధి కేంద్ర మంత్రి సృతి ఇరానీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రాయ్ బరేలి లో సోనియా గాంధీ ముంజలో ఉంది.

మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి ఎన్డీయే 50స్ధానల్లో ఆధిక్యంలో ఉండగా…29 స్ధానాల్లో యూపిఏ ఆధిక్యంలో ఉంది. ఇక తమిళ నాడులో డీఎంకే పార్టీ లీడ్ లో ఉంది. ఇక కర్ణాటక, రాజస్ధాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యం కనబురుస్తుంది. ఇప్పటికే బీజేపీ మెజార్టీ స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా..బీజేపీ ముఖ్య నేతలను ఢిల్లీకి రావాలని పిలపునిచ్చారు.

- Advertisement -