ఓటు హక్కు వినియోగించుకోండి:దర్శకుడు ఎన్‌.శంకర్

157
n shankar
- Advertisement -

పోలింగ్‌ శాతం పెంపునకు బల్దియా కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు పోలింగ్ శాతం పెంచేందుకు ప్రజల్లో అవగాహన తీసుకొస్తుండగా సినీ ప్రముఖులు కూడా అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తాజాగా దర్శకుడు ఎన్. శంకర్ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 1 న జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు ను వినియోగించుకోని హైదరాబాద్ మహా నగర అభివృద్ధికి దోహద పడాలని సూచించారు ఎన్. శంకర్.

పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రకటనలు, వీధి నాటకాల ద్వారా బస్తీవాసులను చైతన్యం చేయడం, గోడప్రతులు, స్టిక్కర్లు, కరపత్రాల ద్వారా ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు.

- Advertisement -