ఎంపీ సంతోష్‌ను కలిసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త..

133
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త శనివారం ప్రగతి భవన్‌లో రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా.. దసరా పండుగను పురస్కరించుకుని ఊరి ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు మొక్కలు నాటే కార్యక్రమంలో ఐవీఎఫ్‌-తెలంగాణ ఆధ్వర్యంలో.. 1100 దేవాలయాలలో 1100 జమ్మి చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతున్నది.

ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్‌ను ఉప్పల శ్రీనివాస్ గుప్త మర్యాద పూర్వకంగా కలిసి మహాబిలం చెట్టును బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తను, వారి ఐవీఎఫ్‌ తెలంగాణ టీమ్ సభ్యులకు ఎంపీ సంతోష్ ధన్యవాదాలు తెలిపి అభినందించారు.

- Advertisement -