ఒకేసారి ఐదు సినిమాలు…సంచలనం

20
- Advertisement -

ఒక సినిమా తీయడానికే కిందమీద పడుతున్న ఈ రోజుల్లో ఒకేసారి ఐదు సినిమాలు తీస్తుండటం నిజంగా ఓ సంచలనం అని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అభివర్ణించారు. కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మించిన “ఉపేంద్ర గాడి అడ్డా” చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని దశపల్లా హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇదే బ్యానర్ లో ఇదే హీరోతో తీస్తున్న ఐదు సినిమాల టీజర్లను విడుదల చేశారు.

అలాగే “ఉపేంద్ర గాడి అడ్డా” చిత్రం ట్రైలర్ ను, నరసింహ నంది దర్శకత్వంలో ఈ నిర్మాత తీయబోతున్న ఆరవ చిత్రం “1920 భీమునిపట్నం” పోస్టర్ ను ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రహ్మానందం విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, “మా అబ్బాయి కూడా హీరో అనే విషయం తెలిసిందే. ఇలాంటి కొత్త హీరోలను ఆశీర్వదించినపుడు మా అబ్బాయిని కూడా భగవంతుడు ఆశీర్వదిస్తాడన్న ఉద్దేశ్యంతో ఈ ఫంక్షన్ కు వచ్చాను. కుమారుడ్ని హీరోగా పరిచయం చేయడమే కాదు ఒకేసారి ఈ చిత్ర నిర్మాత అచ్యుతరావు ఓక ఫ్యాక్టరీ లాగా ఒకేసారి ఐదు సినిమాలు తీస్తుండటం అభినందనీయం. దీనివల్ల పరిశ్రమను నమ్ముకున్న వారికి అవకాశాలు ఇచ్చి, భోజనం పెట్టినట్లవుతుంది. తన కుమారుడి పట్ల ఆయనకున్న ప్రేమ, నమ్మకానికి ఇది ఓ నిదర్శనం. ..ఈ రోజు హీరో కంచర్ల ఉపేంద్ర పుట్టినరోజు ఇంత భారీగా జరుపుకోవడం ఆనందదాయకం. అతనికి ఉజ్జ్వల భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

Also Read:KCR:ప్రజాసేవ చేస్తే..దాడులు చేస్తారా?

చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ , “మంచి కథలను ఎంపిక చేసుకుని, టాలెంట్ ను గుర్తించి మరీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాలను తీస్తున్నాం. నవంబర్ నుంచి ప్రతీ నెలా ఒక సినిమాను విడుదల చేయబోతున్నాం. పూర్తి వినోదం, మాస్ అంశాలతో ఈ చిత్రం అలరింపజేస్తుంది” అని అన్నారు. హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ , “నా పుట్టిన రోజు సందర్భంగా నాతో మా నాన్న తీస్తున్న ఐదు సినిమాల టీజర్స్ ను విడుదల చేస్తూ, ఇంత భారీగా ఈ కార్యక్రమం జరుపుతుండటం నాకో వెలకట్టలేని పెద్ద బహుమతి. ఇంతమంది ఆత్మీయులు, శ్రేయోభిలాషుల, పరిశ్రమ వారు అందజేసిన ఆశీస్సులు నాకు వరాలు అవుతాయని’ అని అన్నారు.

- Advertisement -