తిరుమలకు జగన్‌..అమిత్ షాతో శ్రీవారి దర్శనం

90
amith
- Advertisement -

దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశంలో పాల్గొనేందుకు ఏపీలో పర్యటించనున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఇవాళ సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఏపీ సీఎం జగన్‌….ఈ సందర్భంగా అమిత్‌ షాకు ఘనస్వాగతం పలకనున్నారు.

అనంతరం ఇరువురు కలిసి తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం హోంమంత్రి తిరుపతిలోనే బసచేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతి తాజ్‌ హోటల్‌లో జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. అమిత్‌షా ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. సమావేశం అనంతరం జగన్‌, అమిత్‌షా ప్రత్యేక విందులో పాల్గొననున్నారు.

- Advertisement -