మోదీ వల్లే ఇద్దరు మంత్రుల మరణం..!

271
stalin
- Advertisement -

తమిళనాడు ఎన్నికల వేళ అన్నాడీఎంకే- బీజేపీ కూటమి, డీఎంకే మధ్య మాటల యుద్దం తారాస్ధాయికి చేరింది. బీజేపీ నేత రాధారవి…డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించగా అంతేస్ధాయిలో స్పందించారు ఉదయనిధి స్టాలిన్.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ టార్చర్ వల్లే ఇద్దరు కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలు మరణించారని ఆరోపించారు. తనకు అడ్డుగా ఉన్నారని బీజేపీ సీనియర్ లీడర్ ఎం వెంకయ్య నాయుడునూ పక్కకు తప్పించారని మండిపడ్డారు. మిస్టర్ మోడీ, మీ ముందు మోకరిళ్లడానికి నేను సీఎం పళనిస్వామిని కాదు. నేను ఉదయనిధి స్టాలిన్. కలైంజ్ఞర్ వారసుడిని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

అయితే ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలతో పాటు దివంగత మంత్రుల కుటుంబీకులు ఖండించారు. మీ ఎన్నికల ప్రచారానికి తమ తల్లి జ్ఞాపకాలను దుర్వినియోగం చేయవద్దని సుష్మా స్వరాజ్ తనయురాలు బాన్సురి స్వరాజ్ పేర్కొన్నారు.

- Advertisement -