శ్రీవారికి కానుకగా రెండు డీసీఎంలు…

47
- Advertisement -

అపదల మొక్కులవాడికి ఎన్నో కానుకలు గల్లా నిండ డబ్బులు కురిపిస్తారు అనంత భక్తజనం. ఇదే కోవలోకి టీవీఎస్‌ సంస్థ… అందుకు మినహాయింపు కాదని నిరూపించింది. సంస్థ వైస్ ప్రెసిడెంట్‌ చెన్నైకి చెందిన సెల్వం రూ.80లక్షల విలువైన రెండు డీసీఎం లారీలను టీటీడీకి కానుకగా సమర్పించారు. వీటికి ఏసీ సౌకర్యం ఉండటం చేత కూరగాయల రవాణాకు పనిచేస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. తాళాలు టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. అంతకంటే ముందుగా శ్రీవారి ఆలయం ఎదుట కొత్త వాహనాలకు పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ అన్నప్రసాద కార్యకలాపాలకు, కూరగాయలను తీసుకెళ్లేందుకు ఏసీతో ఈ వాహనాలను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. దాతలకు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి…

భూతల్లికి రైతు తెలిపే కృతజ్ఞత సంక్రాంతి..

మంచి ఆలోచనల పెంపే భోగి…

‘ భోగి ‘ పండుగ ప్రత్యేకత తెలుసా ?

- Advertisement -