రెండోరోజు డిపోలకు క్యూ కడుతున్న ఆర్టీసీ కార్మికులు…

428
rtc drivers
- Advertisement -

మూడు రోజుల్లోగా విధుల్లో చేరండి.. మిమ్మల్ని కాపాడుకుంటాం అంటూ సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుకు మంచి స్పందన వస్తోంది. రెండో రోజు విధుల్లో చేరేందుకు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున డిపోలకు క్యూ కడుతున్నారు.

సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ సమ్మతి పత్రాలను డిపో మేనేజర్లకు అందజేస్తున్నారు. రెండోరోజు వరంగల్ వెస్ట్‌కు చెందిన కండక్టర్ ఎస్ శ్రీనివాస్‌(ఐడీ 653127),డ్రైవర్ ఎ. రఘుపతి(ఐడీ 652816) విధుల్లో చేరుతున్నట్లు సమ్మతి పత్రాలు ఇచ్చారు. ఇప్పటి వరకు 7గురు కార్మికులు విధుల్లో చేరారు.

అదేవిధంగా మేడ్చల్ డిపోలో కండక్టర్ కేఎస్ రావు విధులకు హాజరవుతారని లెటర్ ఇచ్చినట్లు డీఎం ప్రకాష్ రావు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో విధుల్లో చేరుతున్నట్లు లెటర్ ఇచ్చారు కండక్టర్‌ ఎంఏ ఖదీర్(ఐడి 322544).

విధుల్లో చేరడానికి రేపు(నవంబర్ 5)వరకు అవకాశం ఉండటంతో వేల సంఖ్యలో కార్మికులు విధుల్లో చేరే అవకాశం ఉంది.

- Advertisement -