851 ఏఈవో పోస్టులకు నోటిఫికేషన్‌

253
TSPSC AEO Notification 2017
- Advertisement -

వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న 851 అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ  పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) ద్వారా భర్తీ చేసుకోవాలంటూ ఆర్థిక శాఖ సూచించింది.ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నెల 13 నుంచి 31 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చే నెల 21న పరీక్ష జరగనుంది.

తెలంగాణ ప్రభుత్వం భూ సర్వేను ప్రతిష్మాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  రాష్ట్రంలో ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం  ఏఇఓ పోస్టులను మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది.

త్వరలోనే పోలీసు శాఖలో 26,000 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు డీజీపీ అనురాగ్‌ శర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 33 శాతం రిజర్వేషన్‌ ప్రకారం ఎనిమిది వేల ఉద్యోగాలను మహిళలతో భర్తీ చేస్తామని వెల్లడించారు డీజీపీ.  రెండు దశల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -