మా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు- కేటీఆర్‌

164
- Advertisement -

శనివారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె .టి .రామారావు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌వీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 27 వస్తే టీఆర్ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు అవుతుంది. కెసిఆర్‌కు 1995లో నలభై యేండ్ల వయసు..అది రాజకీయంగా టేక్ ఆఫ్ అయ్యే వయసు..చంద్రబాబు ఒక వైవు ,చరిత్ర ఉన్న కాంగ్రెస్ మరో వైపు..తెలంగాణ కోసం విఫలమైన పోరాటాలు ఇంకో దిక్కు..తెలంగాణ అంశమే తెరమరుగైన పరిస్థితులు అపుడు…కెసిఆర్ అపుడు చంద్రశేఖర్ రావు మాత్రమే..ఒక మెదక్ జిల్లాకు మాత్రమే తెలుసు..మీడియా,మనీ,మజిల్ పవర్ కెసిఆర్‌కు అపుడేమి లేదు..ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్యలో కెసిఆర్ ఒక్కడిగా ఇరవై యేండ్ల క్రితం టీఆర్ఎస్ స్థాపించారని కేటీఆర్‌ గుర్తు చేశారు.

ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు తన పదవులను గడ్డిపోచలా త్యాగం చేసి..లక్ష్యం నుంచి తప్పుకుంటే రాళ్ళతో కొట్టి చంపండి అని అన్న దమ్మున్న నేత కెసిఆర్. తెలంగాణను గేళీ చేసిన పరిస్థితుల్లో కెసిఆర్ ఒక్కడిగా ప్రయాణం ప్రారంభించారు. నిరాశ కల్పించినా కెసిఆర్ కుంగిపోకుండా తెలంగాణ సాధించారు. అలాంటి కెసిఆర్‌ను ఇప్పుడు గౌరవం లేకుండా కొందరు మాటాడుతున్నారు. సీఎంలను ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్‌ది. మా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు.గోడకు వేలాడ దీసే తుపాకీ మౌనంగా ఉంటుంది..టైం వచ్చినపుడు తుపాకీ విలువ తెలుస్తుంది. విద్యార్థులు ఉస్మానియా,కాకతీయ యూనివర్సిటీల్లో చదువుకుంటే బీజేపీ నేతలు వాట్సాప్ యూనివర్సిటీలో అబద్దాలు నేర్చుకుంటున్నారు..వ్యాప్తి చేస్తున్నారని కేటీఆర్‌ ఎద్దేవ చేశారు.

కెసిఆర్ మౌనాన్ని ఎవ్వరూ తక్కువ అంచనా వేయొద్దు.అవసరం వచ్చినపుడు బఫున్ల భరతం పడతాం. విద్యా ,ఉద్యోగ అవకాశాలు తెలంగాణ వచ్చిన తర్వాత భారీగా పెంచిన ఘనత కెసిఆర్ దే..గురుకుల పాఠశాలలు ,కాలేజీలను తెలంగాణలో వందల శాతం పెంచుకున్నాం..ఇవన్నీ తెలియకుండా కొందరు సన్నాసులు మాట్లాడుతున్నారు.తెలంగాణలో టీఆర్ఎస్ ఇవన్నీ చేస్తే.. కేంద్రంలో ఉన్న బీజేపీ విద్యాపరంగా చేసింది గుండు సున్న అన్నారు. కొత్త ఐఐఎం,ఐఎస్ఆర్,ఐఐటీ, ట్రిపుల్ ఐటీ సంస్థలను దేశమంతా ప్రకటించిన బీజేపీ తెలంగాణకు ఇచ్చింది గుండుసున్నా..నవోదయా విద్యాలయాలు కూడా తెలంగాణకు దక్కలేదు..కొత్త మెడికల్ కాలేజీల్లో తెలంగాణకు దక్కింది మొండి చేయి..ఇన్ని మొండి చేతులు చూపిన బీజేపీకి తెలంగాణలో ఎందుకు ఓటేయాలి ? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ మూసేస్తుంటే ఇక బయ్యారంలో బీజేపీ ఉక్కు ఫ్యాక్టరీ కడుతుందా ?..ఇలాంటి వాటి గురించి మాట్లాడకుండా బీజేపీ మాటకు ఇండియా పాకిస్థాన్ అంటుంది.ఏమైనా అంటే దేశం కోసం ధర్మం కోసం అంటారు. బీజేపీ నేతలకు తెలంగాణ దేశంలో భాగం గా ఉందని కనిపించడం లేదా ?..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు ద్వారా యువత సమాధానం చెప్పాలి అన్నారు. అడ్వకేట్ లు ,జర్నలిస్టులకు సంక్షేమ నిధి కేటాయించాము. మేము గణాంకాలతో అభివృద్ధి గురించి చెబితే బీజేపీ మాటలు చెబుతోంది..మేము ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడితే మోడీ పకోడీ ల గురించి మాట్లాడుతారు..పకోడీలు అమ్ముకుంటే కూడా అది కూడా తన ఘనతే అని మోడీ చెప్పుకుంటరు అని కేటీఆర్‌ విమర్శించారు.

టీఆర్ఎస్ మీటింగ్‌లో బఠాణీలు అమ్ముకునే వారుంటారు..అది మా ఘనతగా చెప్పుకోవాలా ?..మోడీ మాటలు కొట్లల్లో ఉంటాయి..చేతలు పకోడీ ల్లా ఉంటాయి (బాత్ కరోడోమే -కామ్ పకోడీమే )..మోడీ 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ ప్యాకేజి అన్నారు..ఒక్కరికైనా ఏమైనా వచ్చిందా ?..దూషణలు చేస్తున్న వారికి మిత్తితో సహా బదులిస్తామన్నారు..ఒకడు ఎగిరెగిరి ఏమై పోయాడో తెలుసు..అందరీ చిట్టాలు మా దగ్గర ఉన్నాయి.. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలవాలి..మనం చేసినవి చెప్పి ఓట్లడగాలి అని కేటీఆర్‌ సూచించారు.

- Advertisement -