వెక్కి వెక్కి ఏడ్చి న‌వ వ‌ధువు గుండె పోటుతో మృతి..

361
Odisha Bride
- Advertisement -

అప్పుడే పెళ్లైన ఓ న‌వ వ‌ధువు అప్పకింతల సమయంలో అత్తారింటికి వెళ్తూ.. వెక్కి వెక్కి ఏడ్చింది. గుక్క‌ప‌ట్టి ఏడ్చిన ఆ వ‌ధువు గుండె ఆగి మరణించింది. ఈ విషాద ఘటన ఒడిశాలోని సోనాపూర్ జిల్లా జులుందా అనే గ్రామంలో శుక్రవారం జరిగింది. బాలానగర్ జిల్లా తెటెల్ గావ్ కు చెందిన బిశికేశన్ అనే యువకుడితో గుప్తేశ్వరి సాహూ అలియాస్ రోసీ సాహూకు శుక్రవారం వివాహం జరిగింది.

పెళ్ల తంతు పూర్తయ్యాక బిడ్డను అత్తారింటికి పంపించడం కోసం అప్పగింతలకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లికూతురు రోసీ అదేపనిగా ఏడ్చింది. నీరసించిపోయి కుప్పకూలిపోయింది. వెంటనే ఆ అమ్మాయిని స్పృహలోకి తెచ్చేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.

దీంతో దుంగురిపాలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారు. పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, కొన్ని నెలల క్రితమే తండ్రి చనిపోవడంతో ఆమె తీవ్రమైన విషాదంలో ఉందని, ఆ అమ్మాయి మేనమామ, కొందరు స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలే ఆమెకు ఈ పెళ్లి చేశారని జులుందా గ్రామస్థులు చెప్పారు.

- Advertisement -