సీఎం కేసీఆర్ గొప్ప వ్యక్తి- ఎంపీ నామ

438
TRS MP Nama Nageswara Rao Praises CM KCR
- Advertisement -

ప్రపంచ దేశాలు కరోన ని ఎదుర్కోవడంలో విఫలం అయ్యాయి. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక చర్యల ద్వారా కరోనాను కట్టడి చేసిన గొప్ప వ్యక్తి అని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో పండిన పంటను 30 వేళా కోట్లతో కొనుగోలు చేస్తూ ఈ సమయంలో రైతులను కంటికి రెప్పలగా కాపాడుకుంటున్న గొప్ప సీఎం కేసీఆర్ అని నామ తెలిపారు. ఆదివారం మహాబూబాబాద్ నియోజకవర్గంలో ఎంపీ నామ నాగేశ్వరరావు సానిటైజర్స్,మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. మహబూబాబాద్ నియోజకవర్గానికి ఇంత పెద్ద మొత్తంలో సానిటైజర్స్,మాస్కులు పంపిణీ చేసిన ఎంపీ నామ నాగేశ్వర్ రావుకి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. లాక్ డౌన్ సమయంలో సీఎం కేసీఆర్ పేదల,రైతుల,వలస కూలీలా పట్ల ఎన్నో చర్యలు చేపట్టి అందరిని అదుకుంటున్న గొప్ప సీఎం కేసీఆర్ అని మంత్రి అన్నారు.

ఇప్పటికి సీఎం కేసీఆర్ ఆదేశాలతో బయటి రాష్ట్రాల నుండి వచ్చిన వారిని పంపడానికి ఏర్పాట్లు చేశాము,అలాగే బయటి రాష్ట్రాల్లో ఉన్న వారిని రప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. జీవో నెంబర్ 3 పై రాష్ట్రంలో గిరిజనుల ఆందోళనలు కొనసాగుతూన్నాయి,ఎవరు ఆందోళన చెందవద్దు,సీఎం కేసీఆర్ త్వరలో పిటిషన్ వేసి తగిన న్యాయం సీఎం కేసీఆర్ చేస్తాడు. పార్లమెంట్ సభ్యులతో కలిసి లాక్ డౌన్ తరువాత సీఎం కేసీఆర్ సూచనలతో ఢిల్లీ వెళ్లి గిరిజనుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.

- Advertisement -