తెలంగాణ ప్రభుత్వంపై అసంబద్ధ ఆరోపణలు చేయటంపై లోక్ సభలో ఎంపీ నామ ఆగ్రహం వ్యక్తం చేశారు.జీరో అవర్లో భాగంగా శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్ట్ ప్రమాద ఘటన విషయమై తెలంగాణ ప్రభుత్వం పైన అసంబద్ధ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ (రేవంత్ రెడ్డి) వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు టి.ఆర్.ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు.