గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న శ్రద్ధా కపూర్..

369
Shraddha Kapoor
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతంగా కొనసాగుతుంది. దీనిలో పాల్గొని మొక్కలు నాటడానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేయడం జరుగుతుంది.

బాహుబలి ప్రభాస్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ బొంబాయిలోని తన నివాసంలో మొక్కలు నాటి ఈ విషయాన్ని తన సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ శ్రద్దకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -