కన్నతల్లిని జన్మభూమిని మరువద్దు…సంతోష్‌

214
mp
- Advertisement -
  • పేట్ల బుర్జు హస్పిటల్ అభివృద్ధికి రూ.కోటి కేటాయించిన టీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్
  •  ఎంపీ నిధుల నుండి రూ. కోటి కేటాయించిన ఎంపీ

“కన్న తల్లిని, జన్మ భూమిని మరువద్దు అంటారు. ఇదే బాటలో రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ తను పుట్టిన పేట్ల బుర్జు ప్రభుత్వ హస్పిటల్ అభివృద్ధికి ఎంపీ నిధుల నుండి కోటి రూపాయలు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు.

సంతోష్‌ పుట్టిన హస్పిటల్ ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని, అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయం.” అని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌ నిర్ణయం ఎంతోమందికి స్పూర్తిని కలుగజేస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ముందుకు రావడానికి దోహద పడుతుందన్నారు.ఈ నిధులతో పెట్ల బుర్జు ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

ఎంపీ సంతోష్ నిర్ణయం స్పూర్తితో తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించినవారందరూ ముందుకు రావాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెట్ల బుర్జు ఆసుపత్రి అవసరాలు మరియు సౌకర్యాలు తీర్చేలా నిధులు వినియోగించాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి..

15రోజుల్లో..బన్సీలాల్‌పేట మెట్లబావి పూర్తి

300క్వింటాళ్ల.. రేషన్‌ బియ్యం పట్టివేత

ఆధార్ అప్‌డేట్‌ తప్పనిసరి..

- Advertisement -