ఏమైనా చేసుకోండి భయపడే ప్రసక్తే లేదు

170
- Advertisement -
  • బీజేపీది రాముడు పేరు చెప్పి రౌడీయిజం చేసే పద్ధతి
  • బీజేపీలో గెలిచేవాళ్లు లేరు కాబట్టి నేతలను గద్దల్లా తన్నుకుపోతుంది
  • ఐటీ, ఈడీ ఏది వచ్చినా నిలబడి కొట్లాడుతాం
  • సిట్ విచారణకు రావడానికి బీఎల్ సంతోష్ కు ఎందుకు భయం
  • కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

రాష్ట్రంలో బీజేపీ గుండాయిజం చెల్లదని…ఈడీ ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి బయపెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ అని మరోసారి గుర్తుచేశారు. ఆత్మగౌరవం కోసం ఎందాకైన కొట్లాడుతామని అన్నారు. బీజేపీ గుండాలు తెలంగాణ ఉద్యమ నాయకులను తట్టుకోలేరని అన్నారు. దేశంలో రాముడి పేరు చెప్పి రాజకీయం చేయడం బీజేపీ పని అని మండిపడ్డారు. ఏం చేసుకున్నా భయపడే ప్రసక్తే లేదని తెలిసి చెప్పారు.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ…“అసలు బీజేపీ వాళ్లకు రాష్ట్రంలో ఏం పని ? ‘రామ్ రామ్ జాప్న.. పరాయి లీడర్ ఆప్నా’ అనేదే బీజేపీ పని. ఆ పార్టీకి ఒక నాయకుడు లేడు. ఒక సిద్ధాంతం లేదు. వాళ్లు ప్రజలలో లేరు. వాళ్లలో పనిచేసిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీకి నాయకులు లేరు. పోటీ చేసినా వాళ్లు ఎన్నికల్లో గెలువరి భావించి కాంగ్రెసు, టిఆర్ఎస్ వంటి పార్టీల్లో పెద్ద లీడర్లపై కేసులు పెట్టి, ఐటీ దాడులు చేయించి ప్రలోభావాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు.

బీజేపీలో చేరకపోతే ఈడీ,ఐటీ సంస్థలను ఉసిగొల్పుతున్నారు. దేన్ని ఉసిగొలిపిన తెలంగాణ ప్రజలు భయపడే వాళ్ళు కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎవరినీ వదిలిపెట్టకుండా మన దగ్గర గత నెల రోజులుగా ఐటి దాడులను చేస్తున్నారు. అయినా ఏం భయం లేదు. చట్టబద్ధంగా వ్యాపారాలు చేస్తున్నారు.అధికారులు వివరాలు అడిగితే ఇస్తాం,పత్రాలు ఇస్తాం చూసుకోండి అంతేగాని దాంట్లో భయపెట్టేదేముంది ? ప్రచారం చేసుకోవడానికి ఏముంది? ఎందుకోసం ఇట్ల చేస్తున్నారు ?” అని నిలదీశారు.

తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చూసిన బీఎల్‌ సంతోష్‌ పేరు ప్రస్తావించారని గుర్తు చేశారు. ఆయనను విచారణకు రమ్మని సిట్ అధికారులు పిలిస్తే రావడం లేదని తెలిపారు. ఎందుకు అంత భయమని కవిత ఈ సందర్భంగా ప్రశ్నించారు.

“మన దగ్గర దొరికిన దొంగలను విచారణ చేయవద్దట. యాదగిరిగుట్టలో బండి సంజయ్ దొంగ ప్రమాణాలు చేశారు. నిన్న ఏడ్చాడు ఎందుకు ఏడ్చాడో నాకు అర్థం కాలేదన్నారు. సిట్ పిలిచినప్పుడు వెళ్లాలని హైకోర్టు ఆదేశించిన వెళ్లడంలేదని ఆక్షేపించారు. మన మంత్రులు ఐటీ ఈడీ ఆధికారులు పిలిస్తే వెళ్లి విచారణకు హాజరయ్యి అన్ని ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చి వస్తున్నారని కానీ బీఎల్‌ సంతోష్‌ ఎందుకు సిట్‌ ముందుకు రావడంలేదని అన్నారు.

వాట్సాఫ్ యూనివర్సిటీలో అబద్దాలు ప్రచారం చేసే వాళ్లంతా బీజేపీలోనే ఉన్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రజలకోసం ప్రభుత్వం ఆహర్నీశలు కష్టపడి పనిచేస్తుందన్నారు. బీడీ కార్మికులకు రూ.2000 పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. కానీ ఆమొత్తం పైసలు మేమే ఇస్తున్నామని బీజేపీ వాట్సాఫ్ యూనివర్సిటీ పనిచేస్తుందని మండిపడ్డారు. దేశంలో ఏరాష్ట్రంలోని పథకాలు కేవలం తెలంగాణ రైతులకు వాటి ఫలాలు అందుతున్నాయని…కానీ పీఎం కిసాన్ పథకం ద్వారా 13కోట్ల రైతుల నుంచి 10కోట్ల రైతులను తప్పించి రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. ఇదే విషయాన్ని బీజేపీ నాయకులను నిలదీయాలని అన్నారు.

భారత జోడో యాత్రలో భాగంగా తెలంగాణలోకి వచ్చిన రాహుల్‌ గాంధీ ఎందుకు వచ్చాడో తెలియలేదన్నారు. మునుగోడులో ఉప ఎన్నిక జరుగుతుంటే ఉత్తర తెలంగాణ మీదుగా మహారాష్ట్రలోకి వెళ్లిపోయారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు ఉత్తరకుమార మాటలని వాటిని ఎవరు కూడా నమ్మరని వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

నీళ్లు నిధులు నియామాకాల కోసం ఉద్యమం చేసిన తెలంగాణ యువకులకే 95శాతం ఉద్యోగాలు కల్పించడానికి వీలుగా రాష్ట్ర ప్రుభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే వాటిని ఆలస్యంగా ఉత్తర్వులు ఇచ్చారని మండిపడ్డారు. ఉద్యోగాలు నోటిఫికేషన్లు రాష్ట్ర ప్రభుత్వంజారీ చేసిందని తెలిపారు. ప్రస్తుతం 80వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. తెలంగాణలోని ప్రతి తండాను గ్రామ పంచాయతీలగా మార్చమని గుర్తుచేశారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడమే కాకుండా సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందని, అందుకోసం జిల్లాకు రూ. 10 లక్షల చొప్పున అందిస్తోందని వివరించారు. రిజర్వేషన్ల వ్యతిరేకంగా మోదీ పనిచేస్తున్నారని అన్నారు. గిరిజన రిజర్వేషన్లను పెంచి పేదల ప్రభుత్వమని గుర్తుచేశారు. ఈ 10 శాతం రిజర్వేషన్ తోని గిరిజనులకు కలిగే లాభం గురించి తండాల్లోకి వెళ్లి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సమైక్యాంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు తెలంగాణ ప్రజలను ఉచకోతకు గురిచేశారని గుర్తుచేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ టీడీపీ నుంచి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయలేదని గుర్తుచేశారు. 2001లో పార్టీ పెట్టిన కొద్ది నెలలకే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయని, అత్యంత రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించి ఈ ప్రాంతం మొత్తం 19 జడ్పిటిసిలను గెలిపించి జెడ్పి చైర్మన్ ఆనాడు కనీసం చేసుకొని టిఆర్ఎస్ పార్టీ రాజకీయానికి పునాది వేసిందని వివరించారు.

ఇంతింతై వటుడింతై ఎదిగిన తెలంగాణ ఉద్యమ నాయకుడ్నిపై ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందుతోందని అన్నారు. భవిష్యత్‌ను గురించి ఆలోచిస్తూ అనేక అభివృద్ది ప్రణాళికలు తయారు చేశారని వాటినంటిని తెలంగాణ ప్రజలకోసం ఉపయోగించేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 50వేల మంది టిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని, ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క ఇంటికెళ్లి టిఆర్ఎస్ చేస్తున్న కార్యక్రమాలు వివరిస్తే సురేందర్ మల్లొకసారి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పారు. గ్రామంలో ఉన్నటువంటి బూత్ కమిటీలు అన్నిటిని క్రియాశీలకం చేసుకోవాలని గ్రామ శాఖ అధ్యక్షులకు తెలిపారు. సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ పనులను మర్చిపోకూడదని ప్రభుత్వ ప్రభుత్వ పనులు చేయాలని అదే సమయంలో పార్టీ పనులు కూడా చేయాలని పార్టీ ఉంటేనే పదవులు వస్తాయన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు.

కార్యక్రమం ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలలో కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలని కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని ప్రజా ప్రతినిధులు పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు ఏచిన్న ఆపద వచ్చిన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. మిషన్ భగీరథ కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు, ఉచిత విద్యుత్తు, రైతు బీమా వంటి పథకాల ద్వారా లబ్ది జరిగిందని తెలిపారు. మరి ఇన్న కార్యక్రమాలు చేస్తూ తెలంగాణను అభివృద్ది చేసుకుంటూ పోతున్నామని…కేవలం బీజేపీ స్వార్థ రాజకీయాల కోసం మనం ఎందుకు ఆగం కావాలని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి…

ఎమ్మెల్యేల కొనుగోలు…విచారణకు మరో ఇద్దరు

ఆ పోస్టులు మాకొద్దు బాబోయ్‌..బండిపై అసహనం!

అక్రమమైతే తీసుకోండి..దౌర్జన్యం సరికాదు

- Advertisement -