రేవంత్‌ రెడ్డి చిల్లర ప్రయత్నం మానుకోవాలి..

282
karne prabhakar
- Advertisement -

సంచలనాలు కోసమే రేవంత్ మాట్లాడతారు.రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరమన్నారు ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్. కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కర్నె ప్రభాకర్ ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయనతో ఎమ్మెల్యేలు పాటు బాల్క సుమన్‌,సైదిరెడ్డి,జీవన్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. జాతీయ పార్టీకి ఇలాంటి నాయకుడి అవసరం ఉందా..? ఆలోచించండి. టీఆరెస్ నాయకులం ధర్మానికి కట్టుబడి ఉన్నాం. కోర్టులంటే మాకు గౌరవం ఉంది అన్నారు.

ప్రజలంతా ఒకవైపు ఉంటే.. రేవంత్ టీం అంతా ఓవైపు ఉంటుంది. రేవంత్ వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడం మానుకోవాలి. కేటీఆర్‌ ఫార్మ్ హౌస్ విషయాలు చాలా సార్లు చెప్పారు. 111 పరిధిలో మా పార్టీ నాయకుల ఫార్మ్ హౌస్‌లు ఉన్నాయని వీహెచ్‌ చెప్పారు.దీనిపై కాంగ్రెస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలి. రేవంత్‌ చిల్లర ప్రయత్నం మానుకోవాలి. 111 జీవో లో పెద్ద బంగ్లా కట్టుకుంది నువ్వు.. దొంగనే దొంగ అన్నట్టుంది రేవంత్ వ్యవహారం. రేవంత్ మాటలు ఎవరూ పట్టించుకోరు అని కర్నె ప్రభాకర్‌ ఎద్దేవ చేశారు.

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ..దొంగ లెక్కలు.. లెక్కల మాస్టర్ రేవంత్. బ్లాక్ మెయిల్ కి కేరాఫ్.. పెయింటర్ రెడ్డి రేవంత్. రేవంత్ ఆరోపణలకు కేటీఆర్ సమాధానం కూడా చెప్పారు. అనవసర ఆరోపణలు చేయడం కాదు. పెయింట్ వేసిన రేవంత్… వేల కోట్లు ఎట్లా సంపాదించారు అని జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు. జైలుకు వెళ్లి క్రిమినల్ ఆక్టివిటీ నేర్చుకున్నారు అని ఎద్దేవ చేశారు. 111 జీవో లో నీ అక్రమ నిర్మాణాల సంగతి ఏంటో చెప్పు అంటు ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు.

ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ ప్రపంచం మెచ్చిన నేత. రేవంత్ మాటలు చూస్తుంటే జనం నవ్వుకుంటున్నారు. ఓటుకు నోటు కేసు చూసి రాజకీయాలు ఇలా ఉంటాయా అని సిగ్గు పడ్డాం అన్నారు. ఉప్పల్‌లో నువ్వు కొనుగోలు చేసిన భూముల సంగతి ఏంటి..? వాటిని బయట పెడితే ఇప్పటి వరకు సమాధానం లేదు. పీసీసీ పదవి కోసం రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు అని సైదిరెడ్డి దుయ్యబట్టారు.

- Advertisement -