మొక్కలు నాటిన కాళికా దేవి ఆలయ కమిటీ..

235
Green Challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థను స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు నూతనంగా ఎన్నుకోబడిన మహబూబ్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీ శ్రీ కాళికా మాత దేవాలయం నూతన కమిటీ సభ్యులు దాదాపు రెండు వందల మొక్కలను ఆలయ ప్రాంగణంలో నాటడం జరిగింది.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ నూతన అధ్యక్షులు పురుషోత్తం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పచ్చదనాన్ని పెంచడం కోసం కృషి చేస్తున్నారని ఆయన చేపట్టిన ఈ కార్యక్రమానికి మేమందరం కూడా మద్దతు తెలుపుతున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పండరినాథ్, వెంకటయ్య; మల్లేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -