సీఎం కేసీఆర్‌ని కలిసిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు..

67
cm
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన నేపథ్యంలో పలు జిల్లాల అధ్యక్షులు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గారిని ప్రగతి భవన్ నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.

సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎంపీ శ్రీ బడుగుల లింగయ్య యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ శ్రీ కంచర్ల రామక్రిష్ణారెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన ఎమ్మెల్యే శ్రీ రమావత్ రవీంద్ర కుమార్ లు సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి శ్రీ జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ గాదరి కిషోర్, శ్రీ భూపాల్ రెడ్డి, శ్రీ భాస్కర్ రావు, తదితరులున్నారు.హన్మకొండ జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన ఎమ్మెల్యే శ్రీ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన ఎమ్మెల్యే శ్రీ ఆరూరి రమేశ్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలుగా నియమితులైన ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం శ్రీ కేసీఆర్ గారిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్ లు, ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి, శ్రీ చల్లా ధర్మారెడ్డి, శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలు ఉన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సీఎం కేసీఆర్ గారిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబు నగర్ జిల్లా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య ఉన్నారు. ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సీఎం కేసీఆర్ గారిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం అధ్యక్షుడు ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు పార్టీ అధ్యక్షుడు, సీఎం శ్రీ కేసీఆర్ గారిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన నేతలకు అధ్యక్ష పదవుల్లో ప్రాధాన్యతనిచ్చినందుకు గిరిజన నేతలు ఆత్రం సక్కు, కోరం కనకయ్య, కోవా లక్ష్మి లు సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -