త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా ఓ పాన్ ఇండియా సినిమా రూపుదిద్దుకొంటోంది. ఈ కథకు మహేష్ ఎప్పుడో ఓకే చెప్పినా.. గత కొన్ని నెలలుగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు కోరుకుంటున్నాడు. అయితే, కొన్ని సీక్వెన్స్ లకు మాత్రం మహేష్ ఆల్ రెడీ పక్కాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ… మహేష్ డేట్లు సర్దుబాటు కాలేదు. కరెక్ట్ గా డేట్లు ఇచ్చే సమయానికి కృష్ణ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిన దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. దాంతో మహేష్ కొన్నాళ్ల పాటు షూటింగ్ కి గ్యాప్ ఇవ్వాలనుకునట్లు వార్తలు వచ్చాయి.
అయితే, ఇప్పటికే త్రివిక్రమ్ చాలా కాలం నుంచి వెయింటింగ్ లో ఉన్నాడు. ఇక… మహేష్ బాబు లేకపోయినా, ఈ సినిమాని పట్టాలెక్కించేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఈ సినిమా కోసం హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ఓ సెట్ ని తీర్చిదిద్దుతున్నారు. అందులో షూటింగ్ ప్రారంభించడానికి త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా మహేష్ లేని సీన్లన్నీ తీసేసే విధంగా త్రివిక్రమ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ రెండో వారం నుంచి మహేష్ ఈ సినిమాకి డేట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
అరవింద సమేత తరహాలోనే సాగే కథ ఇది. అలాగే పొలిటికల్ ఎలిమెంట్స్ కూడా ఉంంటాయి. దాంతో పాటుగా…. యాక్షన్ మూమెంట్స్, అండ్ ట్విస్టులూ జోడించుకుని వెళ్లాడట త్రివిక్రమ్. ఓ రాజకీయ అంశం కూడా ఈ కథలో కీలక భాగం కానుంది. సంజయ్ దత్ లేదా అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. తమిళ హాస్య నటుడు యోగిబాబుని మరో కీలక పాత్ర కోసం తీసుకున్నారు. సినిమాలో సగ భాగం ఢిల్లీ నేపథ్యంలో సాగనుంది.
ఇవి కూడా చదవండి..