బాలయ్యతో వన్స్ మోర్..!

204
nbk
- Advertisement -

క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని. తన నెక్ట్స్ ప్రాజెక్టుని నందమూరి బాలకృష్ణతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పనులు మొదలుకాగా తాజాగా సినిమాకు సంబంధించి ఆసక్తికరవార్త చక్కర్లు కొడుతోంది.

అందాలతార త్రిష నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన కథానాయికగా నటించనుంది. బాలయ్యకు భార్యగా త్రిష నటించనుండగా ఈ పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలవనుందట. గతంలో వీరిద్దరి కాంబోలో లయన్ సినిమా రాగా వీరిద్దరి కెమిస్ట్రీ బాగాకుదిరింది.

బాలయ్య కోసం పల్నాటి ప్రాంతానికి చెందిన ఓ చరిత్రకారుడి కథను సిద్ధం చేశారట గోపిచంద్ మలినేని. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. వచ్చే సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. ప్రస్తుతం బాలయ్య బాబు..బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత గోపిచంద్‌ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో పాల్గొననున్నారు బాలకృష్ణ.

- Advertisement -