వర్మ ‘దిశ ఎన్‌కౌంటర్‌’‌ ట్రైలర్..

171
disha
- Advertisement -

గత ఏడాది హైదరాబాద్‌లో సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్‌ దిశ హత్యాచారం కేసు గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతం చేశారు. ఈ ఘటన ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘దిశ ఎన్‌కౌంటర్‌’‌ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు వర్మ.

దిశను నలుగురు యువకులు ఎత్తుకెళ్లడం, అత్యాచారం చేయడం, ఆపై లారీలో తీసుకెళ్లి తగులబెట్టడం వంటి ఘటనలకు సంబంధించిన అంశాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి.ఆపై విచారణ నిమిత్తం పోలీసులు రావడం వరకు వర్మ ఈ ట్రైలర్‌లో చూపించారు.ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ‘దిశ’ ఘటన జరిగిన నవంబర్‌ 26 తేదీనే ఈ సినిమాను విడుదల చేస్తానని వర్మ తెలిపారు. శంషాబాద్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర నలుగురు నిందితులు పోలీస్ కాల్పులలో మరణించిన ఘటనతో ఈ సినిమా పూర్తవుతుంది అన్నారు.

- Advertisement -