గజ్వేల్‌కు మరోసారి ట్రయల్ రన్..

219
gajwel rail
- Advertisement -

గజ్వేల్ వాసుల చిరకాల వాంఛ నెరవేరింది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌కు రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. తక్కువ సమయంలోనే మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌ గజ్వేల్‌ వరకు రైలు కూతపెట్టింది.

బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు ప్యాసింజర్‌ రైలు పరుగులు తీసింది. మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు 31 కిలోమీటర్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఖాళీ రైలుతో మరోసారి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. మనోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి వరకు రైల్వే పనులకు అయ్యే వ్యయంలో మూడోవంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది.

2016లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గజ్వేల్‌లో పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో పూర్తిస్థాయిలో కొత్త రైల్వే ప్రాజెక్టుగా ఇది సిద్ధం కాబోతోంది. ఇందులో తొలి దశ ఇప్పుడు ప్రారంభోత్సవానికి రెడీ అయింది. ఈనెల 25 తర్వాత సుముహూర్తం చూసి రైలు సేవలకు పచ్చజెండా ఊపనున్నారు. ప్రస్తుతానికి సింగిల్‌ లైన్‌గా ఉన్న ఈ మార్గంలో డీజిల్‌ లోకోమోటివ్‌తో రైలు తిరగనుంది. మెమూ తరహా రైళ్లను నడిపే అవకాశముంది. ఐదేళ్ల కాలంలో దీన్ని విద్యుదీకరించే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -