టాలీవుడ్‌లో వరుస విషాదాలు..

31
- Advertisement -

2022 టాలీవుడ్‌ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సీనియర్ నటులు, కమెడీయన్స్‌, కళాకారులు వివిధ కారణాలతో కన్నుమూశారు. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు,రమేష్ బాబు,ఎం బాలయ్య, తాతినేని రామారావు,శరత్ ఇలా ఒక్కొక్కరు సినీ ప్రియులకు విషాదాన్ని మిగిల్చి వెళ్లిపోయారు.

తాజాగా సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. కరోనా లాక్ డౌన్లో కంటే కూడా ఎక్కువగా ఈ ఏడాది సినీ ప్రముఖులు మరణించారు అని చెప్పాలి. రీసెంట్‌గా కృష్ణంరాజు, కృష్ణ.. ఇప్పుడు కైకాల సత్యనారాయణ వంటి దిగ్గజాలను టాలీవుడ్ కోల్పోయింది.

కృష్ణంరాజు ఓ జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించారు. తర్వాత విలక్షణ పాత్రలు చేస్తూ ఎంతోమంది నటులను ఇండస్ట్రీకి తీసుకొచ్చి సత్తాచాటారు. టాలీవుడ్ ను కొత్త బాటలో నడిపించి సక్సెస్ అయ్యారు కృష్ణ. నటుడిగా,నిర్మాతగా,దర్శకుడిగా మెప్పించారు.

ఇక కైకాల సత్యనారాయణ హీరో కాకపోయినా విలక్షణ నటుడిగానే అప్పట్లో స్టార్ హీరోలతో సమానంగా నటించి సత్తాచాటారు. ఆ రోజుల్లో కైకాల కాల్ షీట్లు దొరకడం అంత కష్టంగా ఉండేది. ఇలా ఈ ఏడాది చివర్లో ఇలాంటి గొప్ప నటులను కోల్పోవడం అనేది టాలీవుడ్ కు తీరని లోటు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -