మొక్క‌లు నాటిన యాంక‌ర్ ఉద‌య‌భాను

247
udayabhanu green challeange
- Advertisement -

రాజ్య‌స‌భ స‌భ్యులు జోగినిప‌ల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. తాజాగా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గోని మొక్క‌లు నాటారు ప్ర‌ముఖ యాంక‌ర్ ఉద‌య‌భాను. జూబ్లీహిల్స్ లోని పార్కు నందు మూడు మొక్కలు నాటారు. ఈసంద‌ర్భంగా ఉద‌య‌భాను మాట్లాడుతూ…ప్రకృతిని ప్రేమించే రాజ్యసభ సభ్యులు సంతోష్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ని ప్రారంభించడం చాలా గొప్ప విషయం అని. ఇది ఎంతో అందమైన చాలెంజ్ మొక్కలు నాటాలని చాలెంజ్ తో ప్రజల్లోకి తీసుకు రావడం గొప్ప విషయం అన్నారు.

మొక్కలను నాటి పెంచడం మనందరి కర్తవ్యం అని మన వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ఒక నెల రోజులు భోజనం లేకుండా ఉండగలము. ఒక వారం రోజులు నీరు లేకుండా ఉండగలం. కానీ ఆక్సిజన్ లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేము. ప్రకృతికి కోపం వస్తే ఏమవుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాము కరోనా లాంటి వివిధ రకాల వైరస్ ల వల్ల ఇబ్బందులకు గురవుతున్నాము ప్రకృతిని మనమే నాశనం చేస్తున్నాం కాబట్టి ముందు తరాల వారికి మంచి వాతావరణం అందించడం మా అందరి బాధ్యత అన్నారు.

ఈ సందర్భంగా తాను మరోక ముగ్గురికి ఈ చాలెంజ్ ఇస్తున్నాను 1) ప్రముఖ హీరోయిన్ రేణు దేశాయ్ 2) సినీ నిర్మాత సంపత్ నంది 3) ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం ఈ ముగ్గురు కూడా నా చాలెంజ్ స్వీకరించి 3 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని కోరారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -