క‌ల్నల్ సంతోష్ కుటుంబ‌స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన ఫ‌ల‌క్ నుమాదాస్

428
- Advertisement -

భారత్ చైనా స‌రిహ‌ద్దు గ‌ల్వాన్ వ్యాలీలో జ‌ర‌గిని ఘ‌ర్ష‌ణ‌లో మ‌న దేశానికి చెందిన 20మంది జ‌వాన్లు అమ‌రులైన సంగ‌తి తెలిసిందే. అందులో సూర్య‌పేటకు చెందిన క‌ల్న‌ల్ సంతోష్ బాబు కూడా అమ‌రుడ‌య్యాడు. ఈసంద‌ర్భంగా సంతోష్ బాబు కుటుంబ స‌భ్యుల‌ను ప‌లువురు నేత‌లు ప‌రామ‌ర్శిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో విశ్వ‌క్ సేన్ సంతోష్ బాబు ఇంటికి వెళ్లి కుటుంబ‌స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. సంతోష్ బాబు మృతిప‌ట్ల ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు విశ్వ‌క్ సేన్ ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.

ఈసంద‌ర్భంగా హీరో విశ్వ‌క్ సేన్ మాట్లాడుతూ…దేశంకోసం కల్నల్ కుటుంబం చేసిన త్యాగం మరువలేనిదని అన్నారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాటం చేయడం అంటే మాములు విషయం కాదని, అది ఒక్క సైనికుడికి మాత్రమే సాధ్యం అవుతుందని అన్నారు. సంతోష్ త్యాగం చ‌రిత్ర‌లో మిగిలిపొతుంద‌ని స్ప‌ష్టం చేశారు. కాగా సంతోష్ బాబు కుటుంబానికి రూ.5కోట్ల ఆర్ధిక‌సాయంతో పాటు ఆయ‌న భార్య‌కు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వనున్న‌ట్లు ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. ‌

- Advertisement -