వారి త్యాగాలు మరువలేనివి

227
ramnathKvnd
- Advertisement -

దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతోందని రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ అన్నారు. 72వ స్వాంతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరిచిపోదని, ప్రశంసించారు. రైతులకు సాయం చేయడమే ప్రభుత్వాల కర్తవ్యమని, మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలని, ఇందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు.

ramnath-kovind-

త్రివిధ దళాలు, పోలీసులు అన్ని సమయాల్లో బాగా పనిచేస్తున్నారని, వారి ప్రాణాలను ఫణంగా పెట్టి దేశానికి సేవ చేస్తున్నారని, వారి త్యాగాలను మరువలేమని అన్నారు. సరిహద్దుల్లో జవాన్లు అనుక్షణం దేశానికి రక్షణ కవచంగా నిలుస్తున్నారని, విధి నిర్వహణలో ప్రాణాలర్పిస్తూ దేశ సేవలో ఒరిగిపోతున్నారని అన్నారు. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని, దేశంలోని ప్రతి ఒక్క పౌరునికి ప్రభుత్వ ఫలాలు అందేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్రపతి పేర్కొన్నారు.

- Advertisement -