వరుసగా రెండోరోజు పెరిగిన బంగారం ధర..

195
gold
- Advertisement -

బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 పెరుగుదలతో రూ.51,490కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.47,200కు చేరింది.

బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం తగ్గుముఖం పడింది. కేజీ వెండి ధర రూ.500 పెరిగి వెండి ధర రూ.63,000కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.03 శాతం పెరుగుదలతో 1905 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.04 శాతం పెరుగుదలతో 24.70 డాలర్లకు చేరింది.

- Advertisement -