24గంట‌ల్లో 15,413 క‌రోనా కేసులు

191
coronavirus
- Advertisement -

ఇండియాలో క‌రోనా మ‌హామ్మారి రోజురోజుకి శ‌ర వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పేటికే దేశ వ్యాప్తంగా 4ల‌క్ష‌ల మందికి క‌రోనా సోకిన‌ట్లు ప్ర‌క‌టించారు కేంద్ర వైద్య‌, ఆరోగ్యశాఖ అధికారులు. రోజుకు 14వేల‌కు పైగా కొత్త కేసులు వ‌స్తున్న‌ట్లు తెలిపారు. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో దేశంలో 15,413 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.

అదే సమయంలో 306 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 13వేల 254మంది క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 4,10,461కి క‌రోనా సోక‌గా అందులో 2,27,756 మంది కోలుకున్నారు. ఇక దేశంలో అత్య‌ధికంగా ఢిల్లీ, ముంబైలో క‌రోనా కేసులు న‌మోదుఅవుతున్నాయి.

- Advertisement -