సీఎస్‌కే జట్టుకు కరోనా షాక్.. ముగ్గురికి పాజిటివ్..

278
csk
- Advertisement -

ఐపీఎల్‌లో కరోనా కల్లోలం రేపుతోంది. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్‌కు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారినపడగా, తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ కొవిడ్ కేసుల బయట పడ్డాయి. ఆ జట్టు మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆటగాళ్లెవరికీ కరోనా సోకలేదని వెల్లడైంది.

అయితే చెన్నై టీమ్‌ సీఈవో కాశీ విశ్వనాథన్‌, బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ, ఒక బస్‌ క్లీనర్‌లకు వైరస్‌ సోకినట్లు తెలిసింది. నాన్‌-ప్లేయింగ్‌ మెంబర్స్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలడంతో ఫ్రాంఛైజీ అప్రమత్తమైంది. కరోనా బారినపడిన వారిని ఐసోలేషన్‌కు తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -