రఘునందన్‌వి తప్పుడు ఆరోపణలు: చంద్రశేఖర్

40
- Advertisement -

తనపై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలను కొట్టి పారేశారు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. చిల్లర రాజకీయాల కోసమే నిరాధార, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ బహిరంగ సభ నుంచి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికే పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రఘునందన్ రావు చేస్తున్న ఆరోపణలు నిజమైతే… ఆ సర్వే నెంబర్ భూమిలో 90 శాతం తననే తీసుకోమని, మిగిలిన 10 శాతాన్ని నాకు ఇవ్వమని చెప్పాలన్నారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర కీలకం కాబోతోందని…తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకే…. కేసీఆర్ బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు అని తెలిపారు.

తెలంగాణ ప్రగతిని దేశానికి పరిచయం చేస్తారని…ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కేసీఆర్ భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. త్వరలోనే తేదీని ఖరారు చేస్తాం అని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -