తొలివన్డేలో రోహిత్ సేన గెలుపు..

60
rohith
- Advertisement -

విండీస్‌తో జరిగిన తొలివన్డేలో విజయభేరి మోగించింది రోహిత్ సేన. వెస్టిండీస్ విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని కేవలం 28 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కొల్పోయి 178 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ (60), ఇషాన్ కిషన్ (28) మంచి ఆరంభం అందించారు. రోహిత్ అవుటైన తర్వాత కోహ్లీ (8) అనవసర షాట్‌కు యత్నించి ఔట్ కాగా సూర్యకుమార్ యాదవ్ (34 నాటౌట్), దీపక్ హుడా (26 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. విండీస్ బౌలర్లలో అకీల్ హొస్సేన్ ఒక వికెట్ తీయగా, జోసెఫ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్ బ్యాట్స్‌మెన్లు భారత బౌలర్ల ముందు తేలిపోయారు. 43.5 ఓవర్లలో 176 పరుగులకే ఆలౌట్ అయ్యారు. విండీస్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం కాగా హోల్డర్ 57,అలెన్ 29 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో చాహల్ 4,వాషింగ్టన్ సుందర్ 3,ప్రసిద్ 2,సిరాజ్ 1 వికెట్ తీశారు.

- Advertisement -