యాదాద్రికి సీఎం కేసీఆర్..

77
- Advertisement -

ఇవాళ ఉదయం 11 గంటలకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించనున్నారు. ముగింపు దశలో ఉన్న పునర్నిర్మాణ పనుల ఆయన పరిశీలిస్తారు.అలాగే ఆలయ పున: సంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై చర్చించానున్నారు.

మార్చి 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వారం రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పున: ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు, పీఠాధిపతులు యోగులు, స్వామీజీలు, కోట్లాదిగా తరలివచ్చే జనం కోసం కల్పించే సౌకర్యాలపై సీఎం చర్చించనున్నారు.

- Advertisement -