సామాన్యులకు మరో షాక్..

264
cement
- Advertisement -

సామాన్యులకు మరో షాక్. ఇప్పటికే వరుసగా పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో సామాన్యులు అతలాకుతలం అవుతుండగా తాజాగా మళ్లీ గుదిబండ పడింది.తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ బస్తాల ధరలు పెరిగాయి. 50 కిలోల బస్తాపై ధరను రూ.20-30 మేర పెంచుతున్నట్లు డీలర్లు పేర్కొన్నారు. ధరల పెంపుతో సిమెంట్ బస్తా ధర రూ.300-350 మధ్యలో ఉంటుందని తెలిపారు.

డిసెంబర్ నెలాఖరు నుంచి మళ్లీ సిమెంట్ విక్రయాలు పెరగడం, ఇళ్ల నిర్మాణాలకు డిమాండ్ ఏర్పడటంతో తాజాగా కంపెనీలు సిమెంట్ ధరలను పెంచినట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ధర పెంచిన సిమెంట్ కంపెనీల్లో ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇండియా సిమెంట్స్, ఓరియంట్ సిమెంట్, సాగర్ సిమెంట్స్, రామ్‌కో సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, దాల్మియా భారత్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్ ఉన్నాయి.

- Advertisement -