రాష్ట్రంలో 24 గంటల్లో 1531 కరోనా కేసులు…

121
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1,531 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆరుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,37,187కు చేరింది.

ఇప్పటి వరకు కరోనాతో 2,17,401 కోలుకోగా 1330 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,456గా ఉండగా జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 293 కేసులు నమోదు కాగా.. మేడ్చల్ 120, రంగారెడ్డి 114, ఖమ్మంలో 83 కేసులు నమోదు అయ్యాయి.

రాష్ట్రంలో కరోనా మరణాల శాతం 0.56 శాతంగా ఉంటే.. దేశవ్యాప్తంగా 1.5 శాతంగా ఉంది. రికవరీ రేటు రాష్ట్రంలో 91.65 శాతంగా ఉంటే.. దేశంలో 91 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -