- Advertisement -
గార్బెజ్ ఫ్రీ సిటీస్లో భాగంగా ఇండియన్ స్వచ్ఛత లీగ్ తెలంగాణలోని 3పట్టణాలకు అవార్డులు వరించాయి. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, అలంపూర్, కోరుట్ల మున్సిపాలిటీలను ఇండియన్ స్వచ్ఛత లీగ్ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఢిల్లీలో కేంద్ర గృహ, పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్ చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లు అవార్డులు అందుకున్నారు.
గార్బెజ్ ఫ్రీ సిటీస్లో భాగంగా 15వేల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో అలంపూర్ పట్టణం ఎంపికైంది. 25 నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న పట్టణాల విభాగంలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరీలో కోరుట్ల పట్టణాలు ఎంపికయ్యాయి.
- Advertisement -