విద్యాసంస్థల ప్రారంభంపై మార్గదర్శకాలు జారీ

152
dc
- Advertisement -

తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభంపై విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థుల హాజరు కోసం వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపింది. ప్రత్యక్ష తరగతులతోపాటు ఆన్‌లైన్‌ తరగతులు కూడా కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే ‘‘ఈ ఏడాది పరీక్షలు రాసేందుకు కనీస హాజరు శాతం అవసరం లేదు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించొద్దు. ఎనిమిదో తరగతి వరకు డిటెన్షన్‌ ఉండదు. పదో తరగతి షెడ్యూల్‌ను తర్వాత విడుదల చేస్తాం’’అని విద్యాశాఖ పేర్కొంది.

- Advertisement -