రాష్ట్రంలో కొత్తగా 163 కరోనా కేసులు నమోదు..

154
covid-19
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం..గత 24 గంటల్లో కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 276 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,469 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,90,630 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,599 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 2,240 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 828 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 28 కరోనా కేసులు నమోదయ్యాయి.

- Advertisement -