దేశంలో కొత్త‌గా 13,052 మందికి కరోనా..

177
covid
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజా దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 13,052 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,46,183 కు చేరింది. అదే స‌మ‌యంలో 13,965 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,04,23,125 మంది కోలుకున్నారు. గడచిన 24 గంట‌ల సమయంలో 127 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,54,274 కు పెరిగింది. 1,68,784 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

- Advertisement -