రాష్ట్రంలో కొత్తగా 146 కరోనా కేసులు నమోదు..

128
coronavirus
- Advertisement -

తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. గత 24 గంటల్లో 29,755 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 146 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 118 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో ఒక్క మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌లేదు.

దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,613గా ఉంది. ఇక ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,134కి చేరింది. కరోనా నుండి మొత్తం 2,92,696 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 1,825 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 765 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు.

- Advertisement -