బొంతు రామ్మోహ‌న్‌ ట్వీట్‌.. కేటీఆర్‌ ప్రశంసలు..

122
minister ktr
- Advertisement -

జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా బొంతు రామ్మోహ‌న్ ప‌ద‌వీ కాలం నిన్న‌టి ముగియ‌డంతో ఆయ‌న ఓ ఆసక్తికరమైన సందేశం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీకి తొలి మేయ‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌డం త‌న అదృష్టంగా భావిస్తున్నాన‌ని బొంతు రామ్మోహ‌న్ పేర్కొన్నారు. ఈ అవ‌కాశం ఇచ్చిన ముఖ్య‌మంత్రి కేసీఆర్, కేటీఆర్‌కు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో త‌న‌ను ఆద‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. హైద‌రాబాద్ అభివృద్ధి కోసం త‌న శ‌క్తి మేర కృషి చేశాన‌ని తెలిపారు.

ఈ అంద‌మైన ప్రయాణంలో మ‌రిచిపోలేని జ్ఞాప‌కాలు ఎన్నో అని రామ్మోహ‌న్ అన్నారు. ఇవ‌న్నీ త‌న జీవితాంతం గుర్తుండిపోతాయ‌ని పేర్కొన్నారు. త‌న‌పై ప్రేమ చూపించిన ప్ర‌తీ హైద‌రాబాదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు బొంతు రామ్మోహ‌న్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌కు టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ స్పందించారు. మాజీ మేయ‌ర్ బొంతు రామ్మోహన్‌ను ప్ర‌శంసించారు. ఈ ఐదేళ్ల కాలంలో హైద‌రాబాద్ అభివృద్ధి కోసం అద్భుత‌మైన కృషి చేశార‌ని కేటీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -