దేశంలో ఎక్కువ మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ..

136
Minister Babul Supriyo
- Advertisement -

దేశంలో ఎక్కువ మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈరోజు రాజ్యసభ సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యుడు జి.సి చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 20 సూత్రాల కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 150.23 కోట్ల మొక్కలు నాటినట్లు వెల్లడించారు. ఇక 2019-20 సంవత్సరంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో 38.17 కోట్ల మొక్కలు నాటినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

- Advertisement -