తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ వడివడిగా అడుగులు వేసి దేశంలోనే నెంబర్వన్గా నిలబెట్టిన సీఎం కేసీఆర్…పార్టీని దేశవ్యాప్తంగా విసృతపరచడానికి బీఆర్ఎస్గా మార్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైదారాబాద్లో నూతన సచివాలయం నిర్మించిన సీఎం కేసీఆర్…సుపరిపాలనే ధ్యేయంగా పనిచేస్తున్నారు.
Also Read: రజినీ పెట్టిన మంట.. ఏపీలో రచ్చ రచ్చ !
అయితే తాజాగా ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంను పనులను వేగవంతం చేయాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ సంతోష్కుమార్ సంతోష్కుమార్తో కలిసి న్యూఢిల్లీలోని వసంత్ విహార్లో ఏర్పాటు చేస్తున్న నూతన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేశారు. భవన నిర్మాణంను సకాలంలో పూర్తి చేయాలని సూచనలు చేశారు.
Also Read: CMKCR: పారిశుధ్య కార్మికులకు మేడే కానుక