ఉపాధి హామీ పథకంను నిర్వీర్యం చేస్తున్నారు : మంత్రి హరీశ్‌ రావు.

29
harish rao
- Advertisement -

ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. ఈ ప‌థ‌కాన్ని ర‌ద్దు చేసేందుకు కేంద్రం కుట్ర‌లు చేస్తుంద‌ని నిప్పులు చెరిగారు. ఆ కుట్ర‌లో భాగంగానే ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డుల‌ను త‌నిఖీ చేస్తుంద‌న్నారు. కూలీల‌కు సంబంధించిన రూ. 10 వేల కోట్ల వేత‌నాలు పెండింగ్‌లో ఉన్నాయ‌ని కేంద్ర‌మే చెప్పింద‌ని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి వ్య‌తిరేకంగా బీజేపీ నాయ‌క‌త్వం కుట్ర చేస్తుంద‌ని మండిప‌డ్డారు. ఈ మేర‌కు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి హ‌రీశ్‌రావు లేఖ రాశారు.

- Advertisement -