- Advertisement -
కులగణన కేవలం డేటా మాత్రమే కాదు.. తెలంగాణ హెల్త్ చెకప్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన స్వతంత్ర కమిటీ. 300 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది స్వతంత్ర కమిటీ. నిపుణుల కమిటీతో చర్చించి తదుపరి చర్యలు తీసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం.
మా నాయకుడు రాహుల్గాంధీ ఇచ్చి మాట ప్రకారం కులగణన సర్వే విజయవంతంగా నిర్వహించాం అన్నారు. రాష్ట్రంలో బలహీనవర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయం అమలుకు ఈ నివేదిక ఉపయోగపడుతుంది అన్నారు.
Also Read:వర్షాకాలం..న్యుమోనియాతో జాగ్రత్త!
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపడతాం అని… ఈ సర్వే చారిత్రాత్మకమని, దేశానికే రోల్ మోడల్ గా మారుతుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది అన్నారు.
- Advertisement -

