జీహెచ్‌ఎంసీ పరిధిలో పదోతరగతి పరీక్షలు వాయిదా..

298
ssc exams
- Advertisement -

జీహెచ్ఎంసీ,రంగారెడ్డి,సికింద్రాబాద్ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను కూడా రెగ్యులర్ గా గుర్తించాలని పేర్కొంది.

రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతిచ్చింది. జీహెచ్ ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో జాగ్రత్తలు తీసుకున్నామని పరీక్షలకు అనుమతివ్వాలని ప్రభుత్వం కోరగా కరోనాతో ఎవరైనా విద్యార్థి మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

విద్యార్థి మరణిస్తే ఆ కుటుంబానికి ఎన్ని కోట్లు చేస్తారు.. ఎవరు బాధ్యత తీసుకుంటారన్న …పరీక్షల కన్నా విద్యార్థుల జీవితాలే ముఖ్యమని పేర్కొంది. పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాలు కంటైన్ మెంట్ గా మారితే ఏంచేస్తారని అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పలేదన్న హైకోర్టు.

జీహెచ్‌ఎంసీలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా లక్షల విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేమన్న హైకోర్టు….రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పది రోజులకోసారి పరిస్థితి సమీక్షించాలని పేర్కొంది. పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగితే అక్కడ వాయిదా వేసేలా నిర్ణయం తీసుకోవాలని..ప్రతి వారం రివ్యూ చేస్తామని తెలిపింది. ఈ నెల 19న పరిస్థితుల పై మళ్లీ విచారిస్తామని తెలిపింది. దీంతో జూన్ 8 నుండి పదో తరగతి పరీక్షలు గ్రేటర్ పరిధిలో మినహా మిగితా జిల్లాల్లో జరగనున్నాయి.

- Advertisement -